హాస్పిటల్ నుంచి వచ్చి నేరుగా మ్యాచ్ ఆడిన రిజ్వాన్ సెమీస్ లో యోధుడిలా పోరాడాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రిజ్వాన్, ఫకర్ జమాన్ రాణించడంతో పాకిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కానీ ఆసీస్ బ్యాటర్లు విజృంభించడంతో పాకిస్థాన్ సెమీస్ లోనే నిష్క్రమించింది.