ఇదిలాఉండగా ఉపఖండంలో పిచ్ లను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఆస్ట్రేలియా తన జట్టులో నలుగురు స్పిన్నర్లను చేర్చింది. వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ తో పాటు అస్టన్ అగర్, మిచెల్ స్పెప్సన్ లు స్పిన్నర్లే, వీరితో పాటు ఇటీవల దేశవాళీలో అదరగొడుతున్న కొత్త కుర్రాడు టాడ్ మర్ఫీని కూడా జట్టులో చేర్చింది. స్పిన్ పిచ్ లకు అనుకూలంగా ఉండే భారత్ లో స్పిన్నర్ల తోనే భారత బ్యాటర్లకు షాకులివ్వాలని ఆసీస్ కుతూహలంగా ఉంది.