ఇక 2018 తర్వాత ధావన్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేదు. దేశవాళీలో కూడా గబ్బర్.. 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత ధావన్ పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్ మీదే దృష్టి సారించాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో ధావన్.. 34 టెస్టులలో 2,315 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.