దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో అశ్విన్.. 4 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 3 ఓవర్లలో 25 పరుగులు అవసరముండగా.. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో మిల్లర్ రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్ ను ముగించే దిశగా సాగాడు. పేసర్లు భువీ, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా స్పిన్నర్ గా ఉన్న అశ్విన్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే విషయాన్ని గవాస్కర్ ఎత్తిచూపాడు.