ఈ సిరీస్ కు ముందు రెండు టెస్టులే ఆడిన పీటర్సన్.. భారత్ తో మెరుగైన ప్రదర్శన చేశాడు. అంతేగాక ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక మూడో టెస్టులో భాగంగా భారత రెండో ఇన్నింగ్సులో ఛతేశ్వర్ పుజారా ఇచ్చిన క్యాచ్ ను లెగ్ స్లిప్ లో పీటర్సన్ అందుకున్న క్యాచ్.. మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.