కోహ్లి తన క్లాస్ బ్యాటింగ్ తో ఆసాంతం కట్టి పడేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. కోహ్లి చేసిన 79 పరుగులు శతకం కంటే విలువైనవని ఆకాశ్ చోప్రా ట్వీట్ లో పేర్కొన్నాడు. వసీం జాఫర్, ఆర్పీసింగ్ లు కూడా కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తారు.