ఆర్సీబీ కెప్టెన్ ఆప్షన్లపై తన యూట్యూబ్ ఛానెల్ లో చోప్రా మాట్లాడుతూ.. ‘మీరు (ఆర్సీబీ) విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ లను రిటైన్ చేసుకున్నారు. వీరిలో ఎవరైనా కెప్టెన్ కాగలరా..? కోహ్లి గతంలో సారథిగా పని చేసి ఉండొచ్చు. కానీ అతడు మళ్లీ ఆ బాధ్యతలను తీసుకోడానికి సుముఖంగా లేడు. నిజానికి ఇప్పుడు అతడు రాజ్యం లేని పాలకుడు. ఇప్పుడు అతడు ఏ రాజ్యానికీ రాజు కాదు..’ అని వ్యాఖ్యానించాడు.