పంత్-జడేజాలు కలిపి ఆరో వికెట్ కు ఏకంగా 222 పరుగులు జోడించారు. దీంతో భారత్.. 98-5 నుంచి 416 పరుగులకు చేరగలిగింది. అనంతరం ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో త్వరగా దెబ్బకొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 27 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టీమిండియా తాత్కాలిక సారథి బుమ్రా 3, షమీ, సిరాజ్ లు తలో వికెట్ తీశారు.