
India vs England: లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు భారత బౌలింగ్ ను ఇంగ్లాండ్ ప్రతిఘటించింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన 99 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీని కోల్పోయాడు.
జెమీ స్మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులు, బ్రైడన్ కార్స్ 22 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేసింది.
మూడో రోజు భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో ఐదు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్కు కొంత స్థిరత ఇచ్చాడు. కానీ, చివరికి ఇంగ్లాండ్ విజయవంతంగా తన వ్యూహం అమలు చేసి భారత జట్టు స్కోర్ దగ్గరకు చేరింది.
మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్ మొదట్లో హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన షార్ట్ బాల్లపై స్మిత్ ఫోర్, సిక్స్లతో మెరుపులు చూపించాడు. అదే సమయంలో బ్రూక్ జడేజా బౌలింగ్లో స్కూప్ షాట్తో బౌండరీ కొట్టాడు. స్మిత్ పుల్ ప్రయత్నం విఫలమైనప్పుడు భారత జట్టు రివ్యూకు వెళ్లినా అది విఫలమైంది.
అయితే, కొంత సమయం తర్వాత షార్ట్ బాల్ వ్యూహం పనిచేసింది. స్మిత్ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. సాయి సుదర్శన్ కు అతను బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు.
ఇండియా రెండవ కొత్త బంతిని వెంటనే తీసుకుంది. బుమ్రా ప్రారంభించారు. వోక్స్ బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొన్నాడు. బ్రూక్ సిరాజ్ బౌలింగ్ లో తనదైన స్టైల్లో ఎదుర్కొన్నాడు. డౌన్ ది గ్రౌండ్, కవర్ల మీదుగా ఫోర్లు కొట్టాడు. ఈ సమయంలో బ్రూక్ బ్యాట్ ఎడ్జ్ చేయగా, గల్లీలో ఉన్న యశస్వీ జైస్వాల్ సులువు క్యాచ్ను వదిలేశాడు.
90ల్లోకి ప్రవేశించిన బ్రూక్, సిరాజ్ బౌలింగ్ను సిక్సర్తో సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ తర్వాత 9 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు వచ్చాయి.
డ్రింక్స్ తర్వాత వోక్స్ బుమ్రా బౌలింగ్లో ఆఫ్ డ్రైవ్తో ఫోర్ కొట్టాడు. ప్రసిద్ధ్ తిరిగి వచ్చి, బ్రూక్ను షార్ట్ బాల్కు ట్రాప్ చేసి 99 పరుగుల వద్ద ఔట్ చేశాడు. దీంతో హ్యారీ బ్రూక్ కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీని కోల్పోయాడు. హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. వోక్స్ మరో ఫోర్ తో ఇంగ్లాండ్ను 400 పరుగుల మార్క్ దాటించాడు. కార్స్ కూడా స్ట్రీకి షాట్లతో బౌండరీలు సాధించాడు.
వోక్స్ మరో సిక్సర్, థర్డ్మాన్ మీదుగా ఫోర్ కొట్టి సిరాజ్పై ఒత్తిడిని పెంచాడు. కార్స్తో కలిసి 36 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వోక్స్ 38 పరుగులు, కార్స్ 22 పరులు చేసి అవుట్ అయ్యారు.
కీలక సమయంలో సిరాజ్ కార్స్ను బౌల్డ్ చేశాడు. టీ విరామానికి ముందు బుమ్రా తిరిగి వచ్చి, వోక్స్ను నిప్ బ్యాకర్తో బౌల్డ్ చేసి తన నాలుగో వికెట్ సాధించాడు. జోష్ టంగ్ బ్యాట్ ఎడ్జ్ చేయగా అది బౌండరీకి వెళ్లింది. కానీ బుమ్రా చివరికి టంగ్ను బౌల్డ్ చేసి తన ఐదో వికెట్ను సాధించాడు. బుమ్రా తన కెరీర్ లో 14వ సారి ఐదు వికెట్లు సాధించాడు.
మొదటి సెషన్లో భారత్ రెండు వికెట్లు తీసింది కానీ బుమ్రా కాకుండా ఇతర బౌలర్లు రాణించారు. బ్రూక్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, బెన్ స్టోక్స్ (పోల్డ్ బై సిరాజ్), జెమీ స్మిత్లతో స్థిర భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తం 28 ఓవర్లలో ఇంగ్లాండ్ 118 పరుగులు చేసింది.
ప్రసిద్ధ్ కృష్ణ ఓలీ పోప్ (106) వికెట్ తీసాడు. భారత ఫీల్డింగ్ మాత్రం మళ్లీ విఫలమైంది. పంత్ బ్రూక్ క్యాచ్ వదిలాడు, సాయి సుదర్శన్ స్మిత్ క్యాచ్ ను అందుకోలేకపోయాడు. చివరికి బ్రూక్, స్మిత్ భాగస్వామ్యం 50 పరుగుల మార్క్ దాటింది.
యశస్వి జైస్వాల్ 101 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులు, శుభ్ మన్ గిల్ 147 పరుగులు, రిషబ్ పంత్ 134 పరుగులు చేశారు. బెన్స్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4 వికెట్లు తీసుకున్నారు.
ఓలీ పోప్ 106 పరుగులు, హ్యారీ బ్రూక్ 99 పరుగులు, బెన్ డకెట్ 62 పరుగులు సాధించారు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్ తర్వాత భారత్ కు 6 పరుగుల ఆధిక్యం లభించింది.