ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో ఆకట్టుకుంటున్న హార్ధిక్ పాండ్యా, 153.94 స్ట్రైయిక్ రేటుతో 117 పరుగులు చేశాడు. రాజ్కోట్లో జరిగిన నాలుగో టీ20లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, భారత జట్టు 169 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.