మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ హైదరాబాద్లో ఓ ఆటో రిక్షా డ్రైవర్. కొడుకును భారత క్రికెటర్గా చూడాలని కలలు కన్న గౌస్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి చివరి చూపుకి నోచుకోని సిరాజ్, జట్టుతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు సిరీస్లో 14 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు సిరాజ్..