పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు టీమిండియా క్రికెటర్లు కూడా వేడుకుంటున్నారు. ఇటీవలే భారత్ - న్యూజిలాండ్ మధ్య ఇండోర్ వేదికగా రెండో వన్డే జరుగగా ఆ మ్యాచ్ కు ఒక్క రోజు ముందు టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఉజ్జయిని ఆలయానికి వెళ్లి పంత్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే.