తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాతో పాటు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా విఫలమయ్యారు. రోహిత్ ఎల్బీగా నిష్క్రమించగా కోహ్లీ.. స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్, పుజారాలు మాత్రం ఒకే విధంగా ఔటయ్యారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా పడ్డ బంతులను జడ్జ్ చేయడంలో విఫలమై వికెట్లు సమర్పించుకున్నారు.