షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. అయితే అక్కడ భద్రతా కారణాలు, దాయాది దేశంతో సరిహద్దు వివాదాలతో భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లబోదని, తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టీమిండియా ఆడుతుందని కొద్దిరోజుల క్రితం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.