గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి ప్రశంసా పత్రం అందుకున్న బీసీసీఐ సెక్రటరీ జై షా తన ట్విటర్ లో ఇదే విషయాన్ని పంచుకుంటూ.. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకున్నందకు గర్వంగా ఉంది. ఐపీఎల్ ఫైనల్ లో 1,01, 566 మంది ఒక టీ20 మ్యాచ్ కు హాజరైనందుకు గాను ఇది సాధ్యమైంది. దీనికి క్రెడిట్ మా అభిమానులకే..’ అని ట్వీట్ చేశాడు.