టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత యువ భారత్ నేరుగా ఆస్ట్రేలియా పక్కనే ఉన్న న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇక్కడ టీమిండియా.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు కివీస్ కు వచ్చింది. అయితే ఇప్పటికే ముగిసిన టీ20 సిరీస్ ను భారత్ 1-0తో దక్కించుకోగా వన్డే సిరీస్ లో మాత్రం కివీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.