ఇక స్టేడియంలో ఉన్న కుర్చీలు గాలివానకు దిక్కుకొకటిగా ఎగిరిపోయాయి. స్డేడియంలోని పెవిలియన్ అద్దాలు పగిలిపోయాయి. ఇది శ్రీలంక క్రికెట్ కు కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే దేశంలో తలెత్తిన పరిస్థితుల కారణంగా డే అండ్ నైట్ మ్యాచ్ లను నిర్వహించడానికి కరెంట్, జనరేటర్ కూడా లేకపోవడంతో డే లో వాటిని ఆడించారు. ఇక తాజాగా గాలేలో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఆ దేశ బోర్డు ఖజానాకు మరింత బొక్క పడ్డట్టే..