హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారు
ఎంఎస్ ధోనికి హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారు ఉంది. దీనిని ఒకప్పుడు 'వీల్స్ ఆఫ్ ఇండియా' అని పిలిచేవారు. ఈ ఐకానిక్ కారు 55 సంవత్సరాల పాటు భారతదేశ రహదారులపై రారాజుగా కొనసాగింది. హిందూస్థాన్ మోటార్స్ 2014 తర్వాత అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసినందున గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్లు కనిపించడం లేదు. కానీ, ధోని గ్యారేజీలో ఇప్పటికే అంబాసిడర్ కారు ఉంది.