టీమిండియా 2007, 2011 లలో ప్రపంచకప్ లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఫారెన్ కోచ్ లను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు సంధించాడు. అసలు వాళ్లు మన జట్లను నాశనం చేయడం తప్ప ఒరగబెట్టింది ఏమైనా ఉందా..? అని వ్యాఖ్యానించాడు. గతంలో ఫారెన్ కోచ్ లు భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండి చేసిన నష్టాలు గుర్తుచేసుకోవాలని సూచించాడు.