1959లో భారత జట్టు ఐదుగురు కెప్టెన్లను వాడింది. సెలక్టర్లు, బీసీసీఐ ఛైర్మెన్గా ఉన్న లాలా అమర్నాథ్ మధ్య విభేదాల కారణంగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో గులాం అహ్మద్, మనోహర్ హర్ధికర్, పోలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్, హేము అధికారి... రూపంలో ఐదుగురు కెప్టెన్లను వాడింది భారత జట్టు. అప్పట్లో ఇది భారత ప్రభుత్వం, పార్లమెంట్ స్వయంగా కల్పించుకుని భారత క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు కారణమైంది...