ఇషాన్ కిషన్ : బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భాగంగా రోహిత్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన కిషన్ బ్యాట్ తో దుమ్మరేపాడు. మూడో వన్డేలో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. గతంలో రోహిత్, సచిన్, సెహ్వాగ్, గేల్ లు డబుల్ సెంచరీలు చేసినా ఇంత తక్కువ బంతులలో మాత్రం ద్విశతకం బాదింది కిషన్ మాత్రమే. అంతేగాక భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి లెఫ్ట్ హ్యాండర్ కూడా.