అలాగే, రిటెన్షన్ మొత్తానికి సంబంధించి పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య విభేదాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి, అయితే, టాప్ బ్రాకెట్లో ఉన్న ఫ్రాంచైజీ ద్వారా పంత్ను ఉంచుకుంటారని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ పేర్కొందని క్రిక్బజ్ నివేదికలు పేర్కొనడంతో ఈ టాపిక్ కు పుల్ స్టాప్ పడింది.
ఈ నివేదిక ప్రకారం 2022-24 సైకిల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు జట్టులో రూ.16 కోట్ల బ్రాకెట్లో ఉన్న పంత్ ఆ జట్టుకు మొదటి రిటెన్షన్ ఎంపికగా ఉంటాడు. అయితే ఫ్రాంఛైజీ పర్స్ మొత్తాన్ని బట్టి పంత్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2021 రెండవ భాగంలో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్గా కొనసాగిన పంత్.. ఫ్రాంచైజీ భవిష్యత్తుగా పరిగణిస్తూ జట్టును ముందుకు నడిపించే బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పంత్ ను జట్టుతోనే అంటిపెట్టుకుని ఆ ప్రణాళికలు, వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్.