మొదటి టెస్టు పిచ్ క్యూరేటర్‌పై వేటు, స్వయంగా పిచ్ తయారుచేయిస్తున్న టీమిండియా...

Published : Feb 12, 2021, 12:37 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో పిచ్‌పై తీవ్రమైన ట్రోల్స్ వినిపించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌కి స్వర్గధామంగా తయారుచేసిన ఈ పిచ్ కారణంగా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసింది. ఏకంగా 190.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగించి, భారత బౌలర్ల ఓపికకు పరీక్ష పెట్టింది ఇంగ్లాండ్ జట్టు.

PREV
18
మొదటి టెస్టు పిచ్ క్యూరేటర్‌పై వేటు, స్వయంగా పిచ్ తయారుచేయిస్తున్న టీమిండియా...

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 178 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ, నాలుగో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల భారీ టార్గెట్ ఉండడంతో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ పరాజయంతో పిచ్ క్యూరేటర్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది బీసీసీఐ.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 178 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ, నాలుగో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల భారీ టార్గెట్ ఉండడంతో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ పరాజయంతో పిచ్ క్యూరేటర్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది బీసీసీఐ.

28

‘తొలి టెస్టు కోసం రోడ్డును నిర్మించినందుకు క్యూరేటర్‌కి, టీమిండియాకి థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్. మొదట్లో బౌలర్లకు ఏ మాత్రం సహకరించని ఈ పిచ్, నాలుగు, ఐదో రోజుకి పూర్తిగా మారిపోయింది...

‘తొలి టెస్టు కోసం రోడ్డును నిర్మించినందుకు క్యూరేటర్‌కి, టీమిండియాకి థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్. మొదట్లో బౌలర్లకు ఏ మాత్రం సహకరించని ఈ పిచ్, నాలుగు, ఐదో రోజుకి పూర్తిగా మారిపోయింది...

38

ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుటైన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. పిచ్ ప్రభావంతో అతి తక్కువ ఎత్తులో బంతిని వేసిన బెన్ స్టోక్స్, సెంచరీకి చేరువైన విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. దీంతో పిచ్ క్యూరేటర్‌ను బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారం...

ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుటైన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. పిచ్ ప్రభావంతో అతి తక్కువ ఎత్తులో బంతిని వేసిన బెన్ స్టోక్స్, సెంచరీకి చేరువైన విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. దీంతో పిచ్ క్యూరేటర్‌ను బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారం...

48

ఏంఏ చిదంబరం స్టేడియం ఛీఫ్ లోకల్ గ్రౌండ్ మ్యాన్ వీ రమేశ్ కుమార్‌తో కలిసి రెండో టెస్టు కోసం పిచ్ తయారీ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. వీ రమేశ్ కుమార్ ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ గేమ్‌కి కూడా పిచ్ తయారుచేయకపోవడం విశేషం.

ఏంఏ చిదంబరం స్టేడియం ఛీఫ్ లోకల్ గ్రౌండ్ మ్యాన్ వీ రమేశ్ కుమార్‌తో కలిసి రెండో టెస్టు కోసం పిచ్ తయారీ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. వీ రమేశ్ కుమార్ ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ గేమ్‌కి కూడా పిచ్ తయారుచేయకపోవడం విశేషం.

58

బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీని మొదటి టెస్టు తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇండోర్, జైపూర్‌లలో జరగబోయే విజయ్ హాజారే ట్రోఫీ కోసం పిచ్‌లను తయారుచేయాల్సిందిగా ఛటర్జీకి బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ...

బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీని మొదటి టెస్టు తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇండోర్, జైపూర్‌లలో జరగబోయే విజయ్ హాజారే ట్రోఫీ కోసం పిచ్‌లను తయారుచేయాల్సిందిగా ఛటర్జీకి బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ...

68

రెండో టెస్టు కోసం బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్‌కి అనుకూలించే పిచ్ తయారుచేయాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఎర్రమట్టితో కాకుండా నల్ల మట్టితో పిచ్‌ను తయారుచేయాల్సిందిగా రమేశ్‌ కుమార్‌కి సూచించినట్టు సమాచారం... 

రెండో టెస్టు కోసం బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్‌కి అనుకూలించే పిచ్ తయారుచేయాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఎర్రమట్టితో కాకుండా నల్ల మట్టితో పిచ్‌ను తయారుచేయాల్సిందిగా రమేశ్‌ కుమార్‌కి సూచించినట్టు సమాచారం... 

78

శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టు జరిగిన ఏంఏ చిదంబరం స్టేడియంలోనే 15 వేల మంది ప్రేక్షకుల మధ్య ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. 

శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టు జరిగిన ఏంఏ చిదంబరం స్టేడియంలోనే 15 వేల మంది ప్రేక్షకుల మధ్య ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. 

88

బౌలింగ్‌‌కి అనుకూలించేలా పిచ్‌ని రూపొందించిన బీసీసీఐ, టాస్ ఓడి తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వస్తే, ఎలా స్పందిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అలా జరిగితే టీమిండియా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. 

బౌలింగ్‌‌కి అనుకూలించేలా పిచ్‌ని రూపొందించిన బీసీసీఐ, టాస్ ఓడి తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వస్తే, ఎలా స్పందిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అలా జరిగితే టీమిండియా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. 

click me!

Recommended Stories