మయాంక్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన సొనెట్ క్లబ్ కోచ్ దేవేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కు ఎన్సీఏ లో పూర్తి శిక్షణ షెడ్యూల్ ఉందని చెప్పాడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్లకు పునరావాస శిక్షణను అందించిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రజనీకాంత్ శివజ్ఞానం పర్యవేక్షణలో మయాంక్ ఉన్నారు.
అందరూ ఆటగాళ్లలాగే అతను ప్రతి రోజూ ఉదయం కొంత సమయం బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత పునరావాస సెషన్, వ్యాయామ దినచర్య ఉంటుంది. దీని తర్వాత, అతను మళ్లీ నెట్స్లో తన బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారని కూడా తెలిపారు.
"అతను రోజూ ఎనిమిది-పది ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్లో ఎందుకు పేరు పెట్టలేదని నేను అతనిని అడిగాను. దీనికి, మయాంక్ బదులిస్తూ 'సర్, నేను నా శరీరంపై ఎక్కువ భారం వేయలేను. వైట్-బాల్ క్రికెట్పై దృష్టి పెట్టలేను కాబట్టి దానిలోకి వెళ్లవద్దని అనుకున్నానని' దేవేంద్ర తెలిపినట్టు ఐఏఎన్ఎస్ నివేదించింది.