''క్రికెట్ లో జాతి, మతం అనే విబేధాలుండవు... కేవలం టాలెంట్ వుంటే చాలు. కానీ పాక్ క్రికెటర్లు మాత్రం అలా కాదు... ఇతర దేశాల ఆటగాళ్ళు, ప్రేక్షకుల ముందే మతపరమైన ప్రార్థనలు చేస్తుంటారు. మైదానంలో ప్రార్థనలేంటి... అంతగా కావాలంటే డ్రెస్సింగ్ రూంలో చేసుకోవాలి. మాకు కూడా చాలా దైవభక్తి వుంది... అలాగని మైదానంలో మంగళహారతులు చేయడంలేదు కదా. భారత ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మైదానంలో ఎప్పుడూ ప్రార్థనలు చేయలేదే... మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు మీలా ఎప్పుడూ నమాజ్ చేయలేదే'' అంటూ పాక్ ఆటగాళ్లపై కనేరియా సీరియస్ అయ్యారు.