ప్రస్తుతం భారత జట్టు తీరు చూస్తుంటే టీమిండియా సైతం 1990లలో పాకిస్తాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది..’ అని లతీఫ్ వాపోయాడు. 90లలో పాకిస్తాన్ కూడా సారథులను పదే పదే మార్చింది. 1992లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ నెగ్గాక ఆ జట్టుకు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, సలీమ్ మాలిక్, వకార్ యూనిస్, రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, సయూద్ అన్వర్, అమీర్ సొహైల్ లు సారథులుగా పనిచేశారు.