భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని ఐపీఎల్ 2021 వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
ఐపీఎల్లో ఆడించకపోయినా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి ముందు పూజారా కౌంటీ మ్యాచులు ఆడి, ఫిట్గా ఉండకుండా ఉండేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ వేసిన ఎత్తుగడ ఇదనే ఆరోపణలు వచ్చాయి...
చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంతో ఛతేశ్వర్ పూజారా ఖాతాలో కూడా ఐపీఎల్ విన్నింగ్ మెడల్ వచ్చి చేరింది. దీంతో ‘ఆఖరికి పూజారా కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు, విరాట్ నువ్వు మాత్రం ఇంకా గెలవలేకపోయావ్...’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు సీఎస్కే ఫ్యాన్స్...
2008 నుంచి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. గత 9 సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన విరాట్, ఈ సీజన్తో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు.
ఐపీఎల్లో ఆడినంత కాలం ఆర్సీబీకే ఆడతానని ప్రకటించిన విరాట్ కోహ్లీ, వరుసగా రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్కి చేర్చినా... టైటిల్ ఆశలు మాత్రం నెరవేర్చుకోలేకపోయాడు...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తర్వాతి కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది... డేవిడ్ వార్నర్ పేరు ఆర్సీబీ కెప్టెన్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి...