INDvsENG: 134 పరుగులకి ఇంగ్లాండ్ ఆలౌట్... మరోసారి ఐదు వికెట్లు తీసిన అశ్విన్...
First Published Feb 14, 2021, 3:18 PM ISTఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టుకి మంచి ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 134 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్లో 195 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్కి 29వ ఐదు వికెట్లు ప్రదర్శన కాగా అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు.