దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న ముంబైకర్ పృథ్వీ షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దలు, నేషనల్ సెలక్షన్ కమిటీ పై గుర్రుగా ఉన్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వాళ్ల పేరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం వారినే లక్ష్యంగా చేసుకుని పోస్టు పెట్టాడు.