ఆసియా కప్-2022లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ ను చిత్తుగా ఓడించిన పాక్ పై పగ తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. మరోసారి ఇండియాకు ఓటమి రుచి చూపించాలని పాక్ భావిస్తున్నది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 28న జరగనున్న మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.