విడాకుల తర్వాత ఫుల్లుగా దానిపై ఫోకస్ పెట్టిన శిఖర్ ధావన్... ఆ విషయాలను మరిచిపోవడానికి...

First Published Oct 2, 2021, 4:10 PM IST

భారత ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ గత 6 సీజన్లుగా ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. వరుసగా 6 సీజన్లలో 400+ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన ధావన్, ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్‌ సెకండ్ ఫేజ్‌కి ముందు శిఖర్ ధావన్ వైవాహిక జీవితంలో అలజడి వచ్చింది...

ఫేస్‌బుక్‌లో కలిసి అయేషా ముఖర్జీని ప్రేమించి, పెళ్లాడిన శిఖర్ ధావన్... 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు...

తన కంటే వయసులో పదేళ్లు పెద్దది, ఇద్దరు పిల్లల తల్లి అయిన అయేషాను ఏరికోరి ప్రేమించి, పెళ్లాడాడు శిఖర్ ధావన్. అయితే ఈ ఇద్దరి వైవాహిక జీవితానికి విడాకుల రూపంలో 8 ఏళ్లకే ఫుల్‌స్టాప్ పడింది...

ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ అయిన అయేషా,  తొలుత ఓ ఆస్ట్రేలియా బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లాడింది. వీరికి 2000 సంవత్సరంలో ఆలియా, 2005లో రియా అనే ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు...

అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. భర్తతో విడిపోయి, పిల్లలతో కలిసి జీవిస్తున్న అయేషా ముఖర్జీని... భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో చూసిన శిఖర్ ధావన్, చూడగానే తను ప్రత్యేకంగా అనిపించడంతో ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు..

అలా ఏర్పడిన పరిచయం... స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి మూడు ముళ్ల బంధంగా మారింది. ఈ ఇద్దరికీ ఓ బాబు కూడా జన్మించాడు...

సెంచరీ చేసినా, క్యాచ్ పట్టినా, డకౌట్ అయినా ముఖంపై చిరునవ్వు చెదరనివ్వని శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన అలజడితో మానసికంగా కృంగిపోయాడట. 

అయితే కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న శిఖర్ ధావన్, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి తనని తాను బిజీగా ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాడట...

విడాకుల తర్వాత ‘జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిపై నీకున్న పూర్తి శక్తి సామర్థ్యాలను పెట్టాలి. అలాగే మనసు కూడా... నువ్వు చేసే పనిని ప్రేమించాలి... నువ్వు వేసే ప్రతీ అడుగునీ ఎంజాయ్ చేయాలి...’ అంటూ రాసుకొచ్చాడు శిఖర్ ధావన్...

విడాకుల తర్వాత ఆ ఆలోచనలు, తన మనసుని తొలిచివేయకుండా ఉండేందుకు ఫిట్‌నెస్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాడట శిఖర్ ధావన్. ప్రాక్టీస్ సెషన్స్ ముగిసిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువసేపు జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గడిపిస్తున్నాడట...

ఐపీఎల్ 2020లో రెండు సెంచరీలతో 618 పరుగులు చేసిన శిఖర్ ధావన్, 2021 సీజన్‌లో 12 మ్యాచుల్లో 454 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు... ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

అయితే బీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ శిఖర్ ధావన్‌కి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో చోటు కల్పించలేదు సెలక్టర్లు...

click me!