కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో ధోని కంటే ముందు ఆరుగురు బ్యాటర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ (6,706), శిఖర్ ధావన్ (6,284), డేవిడ్ వార్నర్ (5,974), రోహిత్ శర్మ (5,880), సురేశ్ రైనా (5,528), ఏబీ డివిలియర్స్ (5,162) లు ముందున్నారు. ధోని.. 236 మ్యాచ్ లలో 208 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు వచ్చి 5,004 పరుగులు సాధించాడు.