2023 ఐపీఎల్ కోసం డిసెంబర్ 16న ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా బీసీసీఐ వేలం నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నది. వేదిక విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ తేదీ మాత్రం అదేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే వేలాని కంటే ముందు ఫ్రాంచైజీలు మరో పని చేయాల్సిన పని ఉంది. నవంబర్ 15 వరకు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వదిలేసే క్రికెటర్ల జాబితాను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది.