ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీ విక్టరీ... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి... పంజాబ్ కింగ్స్‌కి మరో ఓటమి...

First Published May 2, 2021, 11:02 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై రెండో విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్, ఆ జోరును కొనసాగించలేకపోయింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మరోసారి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పృథ్వీషా అవుట్ అయ్యాడు.
undefined
22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన పృథ్వీషాని హర్‌ప్రీత్ బ్రార్ అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్, ఏబీడీ వికెట్లు తీసిన బ్రార్, నేటి మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో మొదటి బంతికే పృథ్వీషానే అవుట్ చేయడం విశేషం.
undefined
ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 24 పరుగులు చేసి రిలే మెడెరిత్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన రిషబ్ పంత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
undefined
శిఖర్ ధావన్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, హెట్మయర్ 4 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాది లాంఛనాన్ని ముగించాడు.
undefined
సీజన్‌లో ఆరో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఐదో మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ కింగ్స్
undefined
click me!