ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్వారంటైన్‌లోకి... ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనని సన్‌రైజర్స్, ముంబై జట్లు...

First Published May 3, 2021, 11:01 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా పంజా విసిరిన విషయం తెలిసిందే. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 

ఇప్పటికే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు క్వారంటైన్‌లోకి వెళ్లగా, వారితో కలిసి గత మ్యాచ్‌లో పాల్గొన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లింది.
undefined
‘మేం కేకేఆర్‌తో కలిసి మ్యాచ్ ఆడాం. కాబట్టి మేం క్వారంటైన్‌లోకి వెళ్లి, ఐసోలేషన్‌లో పాల్గొనబోతున్నాం. మేం అందరం మా రూమ్‌లకే పరిమితమయ్యాం’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ అధికారి తెలిపారు.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు, కేకేఆర్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడింది. ఇప్పటికైతే క్వారంటైన్ ఎన్నిరోజులు ఉండబోతున్న విషయం తెలియరాలేదు.
undefined
షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, మే 8న మళ్లీ కేకేఆర్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కేకేఆర్ 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండబోతోంది. దీంతో మే 8 నాటికి రెండు జట్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వస్తే.. ఢిల్లీ, కోల్‌కత్తా మ్యాచ్ యథావిథిగా జరుగుతుంది.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి మ్యాచ్ ఆడిన పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడనుంది. ఈ మ్యాచ్ మే 6న జరగాల్సి ఉంది. ఈలోపు కరోనా టెస్టు ఫలితాలను ఆధారపడి ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేక వాయిదా పడనుందా? తేలనుంది.
undefined
ఐపీఎల్‌ను కరోనా ప్రభావం చూపించడంతో షెడ్యూల్ ప్రకారం రేపు మ్యాచ్‌లో పాల్గొనాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కానీ, ముంబై ఇండియన్స్ కానీ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు...
undefined
దీంతో ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేక ప్లేయర్లలందరికీ టెస్టులు నిర్వహించి, మరోసారి క్వారంటైన్ పీరియడ్‌లో పెట్టిన తర్వాత తిరిగి ప్రారంభిస్తారా? అనేది అనుమానంగా మారింది.
undefined
కరోనా పాజిటివ్‌గా వచ్చిన సందీప్ వారియర్ వేగంగా కోలుకుంటుండగా, అసలు ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా అలజడి రేగడానికి కారణమైన వరుణ్ చక్రవర్తి పరిస్థితి నిలకడగా ఉంది.
undefined
click me!