ప్రధానిగారు, మా భద్రత మీద మీకు బాధ్యత లేదా... ఆస్ట్రేలియా కామెంటేటర్ ఘాటు వ్యాఖ్యలు...

First Published May 3, 2021, 9:25 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, కామెంటేటర్లు, అంపైర్లులలో కొందరు దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులకు భయపడి, స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా, భారత విమాన రాకపోకలపై నిషేధం విధించడంతో కొందరు మధ్యలోనే ఇరుక్కుపోయారు...

బయో బబుల్‌ను దాటి బయటికి వెళ్లిన తర్వాత మూడు రోజుల పాటు ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బీసీసీఐ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, వారిని ఆస్ట్రేలియా చేరుకున్నారు...
undefined
అలా ఐపీఎల్ 2021లో బయో బబుల్ దాటి, ఆస్ట్రేలియా వెళ్లేందుకు బయలుదేరిన కామెంటేటర్ మిచెల్ స్లాటర్... స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడంతో మల్దీవుల్లో ఇరుక్కుపోయాడు... తాజాగా మిచెల్ స్లాటర్, ఆసీస్ ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు...
undefined
‘ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆసీస్ ప్రజల భద్రత గురించి నిజంగా ఆలోచిస్తే... మేం స్వదేశం చేరుకోవడానికి ఏర్పాట్లు చేయాలి. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరు చాలా అగౌరవం...
undefined
ప్రధానిగారు మీ చేతులకు రక్తం అంటింది... మాతో ఈ విధంగా వ్యవహరించడానికి మీకు ఎంత ధైర్యం. మా క్వారంటైన్ విధానాన్ని మరింత మెరుగుపరచవచ్చు కదా....
undefined
ఐపీఎల్‌కి వెళ్లడానికి మాకు ఆస్ట్రేలియా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. ఇప్పుడేమీ తమకు సంబంధం లేనట్టుగా వ్యవహారిస్తోంది... కొంతమంది మేం డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చామని మాట్లాడుతున్నారు.
undefined
అవును... మేం డబ్బుల కోసమే వచ్చాం. నేను కూడా బతకడానికే పనిచేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ మిగల్లేదు. కాబట్టి మమ్మల్ని తిట్టడం ఆపండి...
undefined
భారత్‌లో రోజూ కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కూడా ఆలోచించండి. మా మీద కాస్త సానుభూతి చూపండి... మన ప్రభుత్వం దగ్గర కాస్త అయినా మా మీద సానుభూతి మిగిలిఉంటే’ అంటూ ట్వీట్లు చేశాడు ఆసీస్ కామెంటేటర్ మిచెల్ స్లాటర్...
undefined
భారత్‌లో ఐపీఎల్ ఆడుతున్న ఆసీస్ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా ఛాటెర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఆసీస్ ప్లేయర్ క్రిస్ లీన్ కోరాడు...అయితే అలాంటి ఏర్పాట్లేమీ చేయలేమని, ఆసీస్ ప్లేయర్లు సొంత ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పాడు ఆసీస్ ప్రధాని...
undefined
click me!