Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్

Published : Jun 15, 2026, 07:28 AM IST

Deepti Sharma : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ 5 వికెట్లతో చరిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. మెగా టోర్నీని భారత్ విజయంతో ప్రారంభించింది.

PREV
15
దీప్తి శర్మ వరల్డ్ రికార్డు: పాకిస్థాన్‌పై భారత్ మాస్ విక్టరీ

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ గట్టిగా ఉండటంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో స్లో అవుతుందని భావించి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం పేసర్లతో బరిలోకి దిగింది.

25
మంధాన హాఫ్ సెంచరీ.. పాక్‌కు భారీ టార్గెట్

మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ ముందు 171 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 44 బంతుల్లోనే 68 పరుగులు చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిసింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, వికెట్ కీపర్ రీచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులతో మెరుపులు మెరిపించారు. వీరి ఇన్నింగ్స్ వల్ల భారత్ స్కోరు బోర్డుపై 170 పరుగులు పెట్టగలిగింది.

35
దీప్తి శర్మ మాయాజాలం.. చరిత్రలో ఫస్ట్ టైమ్

లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బరిలోకి దిగగా భారత్ స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో 350 వికెట్ల మార్కును దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా స్పిన్నర్‌గా దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే స్పిన్నర్‌కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

45
టీ20ల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్

దీప్తి శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున 275 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 145 టీ20లు, 124 వన్డేలు, 6 టెస్టులు ఉన్నాయి. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 166 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఆమె వన్డేలు, టీ20లు రెండింటిలోనూ విడివిడిగా 160 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం విశేషం. గతేడాది జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో కూడా 22 వికెట్లతో ఆమె టాప్ వికెట్ టేకర్లలో ఒకరిగా నిలిచింది. ఆ టోర్నీ ఫైనల్లో 5 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కూడా గెలుచుకుంది.

55
గోల్డెన్ ఆర్మ్.. తొలి టైటిల్ వేటలో భారత్

బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ దీప్తి శర్మ తన 'గోల్డెన్ ఆర్మ్'తో అదరగొట్టింది. పాకిస్థాన్ కీలక బ్యాటర్‌ను రనౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. టీమిండియా వికెట్ల కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో దీప్తి శర్మనే తొలి బ్రేక్‌త్రూ అందించింది. ఐసీసీ టోర్నమెంట్లలో దీప్తి శర్మ ఎప్పుడూ భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా నిలుస్తోంది. ఇది ఆమెకు నాలుగో టీ20 వరల్డ్ కప్. ఈసారి ఎలాగైనా తమ మొదటి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories