జడేజాతో పాటు టీమ్ మేనేజ్మెంట్ తో కూడా విభేదాలను పక్కనబెట్టి జడ్డూతో సందికి ప్రయత్నించాలని ధోని సూచించినట్టు తెలుస్తున్నది. మరి ధోని రాయబారం ఫలిస్తుందా..? లేదా..? అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది. కాగా జడేజాను రిటైన్ చేసుకోవాలనుకుంటున్న సీఎస్కే. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నేలను వేలంలో వదిలేయనుందని తెలుస్తున్నది.