అయితే గతంలో ఒక్క ద్రావిడ్ కు మాత్రమే రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఏకంగా కోచింగ్ సిబ్బంది మొత్తానికి బ్రేక్ ఇచ్చింది. బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు కూడా సెలవులోనే ఉండటంతో ఎన్సీఏ టీమ్ హృషికేశ్ కనిత్కర్ (బ్యాటింగ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్) లతో కలిసి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.