భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లంతా దాదాపు ఐపీఎల్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుకుని శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు తమ తమ జట్లతో బిజీగా ఉన్నారు.