దక్షిణాఫ్రికా పర్యటన భారత జట్టులోని లోపాలను స్పష్టంగా ఎత్తి చూపింది. జట్టు ఎంపిక, ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, తదితర అంశాలపై ఇన్నాళ్లు చూసీ చూడనట్టు వదిలేసిన సెలెక్టర్లకు.. ఇకపై అలా చేస్తే కుదరదని భారత మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.