ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని దుబాయ్ లో ఆడనున్న టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, భారత్ అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పడంతో తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడటానికి ఐసీసీ ఒప్పుకుంది. భారత మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతున్నందున మంచు ప్రభావం గురించి ఆశ్విన్ ప్రస్తావించారు. మంచు పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం సరైనదేనా అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ రెడ్డిని 8వ బ్యాటర్గా పరిగణించవచ్చనీ, జట్టు ఎంపికలో మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు.
"సుందర్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. నితీష్ రెడ్డి లాంటి ఆటగాడిని పరిగణలోకి తీసుకోవచ్చా? కుల్దీప్ 9వ స్థానంలో ఆడితే, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు. నితీష్ 8వ స్థానంలో, కుల్దీప్ 9వ స్థానంలో, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఆడొచ్చు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల సౌలభ్యం ఉంటుంది. అతన్ని పరిగణించారో లేదో నాకు తెలియదు" అని చెప్పారు.