ఈ క్రమంలో టీమిండియా గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంది. రహానే వైస్ కెప్టెన్ గా ఉండటంలో తప్పులేదు. కానీ సెలక్టర్లు మాత్రం ఓ యువ ఆటగాడిని భావి సారథిగా తీర్చిదిద్దే చక్కటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. టీమిండియాలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ వంటి వాళ్లు జట్టులో వారి స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు.