దీనికి తోడు త్వరలోనే ఐపీఎల్ జరగాల్సి ఉంది. గతేడాది ఐపీఎల్ లో భారత కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు గాయాలపాలై సీజన్ ను ముగించారు. ఇప్పుడు మార్చి వారాంతంలో మొదలై మే వరకు జరిగే ఈ సీజన్ లో ఎవరు ఫిట్ గా ఉంటారో..? ఎవరికి గాయాలవుతాయో..? అంతుచిక్కని ప్రశ్నే. జాతీయ జట్టుకు అంటే చూసీ చూడనట్టు వదిలేసే మన క్రికెట్ వీరులు.. ఐపీఎల్ అంటే మాత్రం ఎక్కడలేని పట్టుదలతో ఆడతారు. ఆ క్రమంలో గాయాల పాలైతే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.