భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో ఆల్-టైమ్ గ్రేట్గా అవతరిస్తున్నాడనీ, అయితే అదే సమయంలో సౌత్పావ్ తన ఆటను పొట్టి ఫార్మాట్లలో పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 2022లో ఘోర కారు ప్రమాదం తర్వాత ఆదివారం పంత్ మొదటిసారిగా టెస్ట్ జట్టుకు తిరిగి వచ్చాడు.
చెన్నైలో బంగ్లాదేశ్తో జరిగిన 2024 టెస్ట్ సిరీస్కు రిషబ్ పంత్ విజయవంతమైన పునరాగమనం గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే గాయాల నుంచి కోలుకోవడం నుండి పునరుజ్జీవనం వరకు అతని అద్భుతమైన ప్రయాణం అభిమానులు-నిపుణులు కొనియాడారు.
ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ 128 బంతుల్లో 13 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 109 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. గిల్తో కలిసి పంత్ నాలుగో వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ను 67/3 దారుణ పరిస్థితిలో ఉన్న సమయంలో 287/4తో ఆకట్టుకోవడంలో వారి భాగస్వామ్యం కీలకమైంది.
అతని పునరాగమన ఈ ఇన్నింగ్స్ రిషబ్ పంత్ సహనాన్ని - నిర్భయ విధానాన్ని ప్రదర్శించింది. డైనమిక్ - ప్రతిభావంతులైన క్రికెటర్గా అతని స్థితిని పునరుద్ఘాటించింది. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ఇప్పుడు న్యూజిలాండ్తో అక్టోబర్ 16న ప్రారంభం కానున్న హోమ్ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు.