కాన్వే, రుతురాజ్, రహానే, రాయుడు, దూబేల జోరుతో సీఎస్కే విజయానికి దగ్గరగా వచ్చింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా తొలి 4 బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. అయితే మోహిత్ శర్మ వేసిన చివరి రెండు బంతుల్లో జడేజా 6, 4 కొట్టి చెన్నైకి మధురమైన విజయాన్ని అందించాడు. దీంతో సీఎస్కే ఐపీఎల్ లో ఐదో ట్రోఫీని అందుకుంది.