కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యా ఎందుకు?
హార్దిక్ పాండ్యా కష్ట సమయాల్లో ఐపీఎల్లో భారత టీ20 జట్టును, గుజరాత్ జట్టును బాగా నడిపించాడు. నాయకత్వ అనుభవం బాగుంది. అందువల్ల 50 ఓవర్ల మ్యాచ్లకు హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్ అని బీసీసీఐ భావించిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొన్ని మ్యాచ్ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన శుభమాన్ గిల్కు నాయకత్వ అనుభవం తక్కువ. ప్రస్తుతం టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో పెద్దగా పరుగులు చేయడం లేదు. దీంతో హార్దిక్ పాండ్యా బీసీసీఐ దృష్టిలో పడ్డాడు.
ఇదే నిజమైతే, ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ కెప్టెన్ గా మారుతాడు. సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుండి రిటైర్ కావచ్చు. చూడాలి మరి రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో !