కొద్దిరోజుల క్రితమే రమీజ్ రాజా అండ్ కో. ను తప్పించిన పాకిస్తాన్ ప్రభుత్వం.. మాజీ సారథి షాహిద్ అఫ్రిదికి చీఫ్ సెలక్టర్ బాధ్యతలు అప్పగించింది. అయితే తన తొలి పాత్రికేయుల సమావేశంలో అఫ్రిది.. మంగమ్మ శపథాలు చేశాడు. మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ పేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కలిసిన సెలక్షన్ కమిటీ త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.