టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పంత్ కు కారు ప్రమాదం అయిందని తెలియగానే అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన కార్తీక్.. దాని కొనసాగింపులో.. ‘మీ అందరికీ నా ప్రత్యేక విన్నపం ఏంటంటే.. దయచేసి ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేయకండి. పంత్ కు, అతడి కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వండి. కొంచెం మానవత్వం చూపండి..’ అని కోరాడు.