క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచకప్ తో మస్తు మస్తుగా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కు మరో నాలుగు నెలల్లో రెండు నెలల పాటు వినోదాన్ని అందించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇండియాలో క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు పొందిన ఐపీఎల్-2022 షెడ్యూల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది.